Friday 28 August 2020

         // వసంతోత్సవం //

బృందావనాన గోపికలతో జగన్నాథుడు 
ఆస్వాదించిన క్రీడోత్సవం ఈ 'వసంతోత్సవం'
మానవాళి అంతా సమానమని కుల,వర్ణ 
భేదాలు విడనాడాలని ఆ పరమాత్మ ఇచ్చిన సందేశం!
ఫాల్గుణ మాసాన ఆ శశి నిండైనమనసుతో 
వర్ణరంజితంగా ఆహ్వానిస్తాడు ఈ రంగులకేళిని 
భారతావనిని రంగులమయం చేయడానికి!
చతుర్దశి రాత్రినాడు జరిగే కామదహనం చెపుతుంది 
మనలోని అనుచిత కోర్కెలు దహించుకుపోవాలని! 
తెలియజేస్తాయి వర్ణమయమైన వదనాలు 
బాహ్యసౌందర్యం కాదు అంతఃసౌందర్యం ముఖ్యమని!
మిత్రులారా! ఆలోచించండి హానికారక రంగులెందుకు
ఈ అందమైన ఆటకి? సహజ వర్ణాలు ఉండగా
పర్యావరణ సహిత రంగులనే వాడుదాం
ద్వేషాన్ని, అసూయని వదిలేద్దాం 
శాంతిని ,సౌభ్రాతృత్వాన్ని పెంపొందిద్దాం  
హోదాని గాక మనిషిని మాత్రమే ప్రేమిద్దాం 
అపుడే ఈ వసుధ అవుతుంది రంగులమయం 
అనునిత్యం మమతానుబంధాల హోళీతో!

No comments:

Post a Comment